atchanaidu: ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒకరు. అయితే, ఆయన ఆ సీనియర్ నేత అనే హోదాకు తగినట్లుగా స్పందించకుండా ఓ విషయంలో చేసిన కామెంట్ అతిగా , చిత్రంగా ఇంకా చెప్పాలంటే కామెడీ గా కూడా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. విశాఖ బీచ్ రోడ్డులో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో కీర్తించారు. అయితే , ఇక్కడే ప్రధాని మోడీ గురించి సంచలన కామెంట్ చేశారు.
Read More: YS Jagan: ముందు మోడీ , ఆ తర్వాత జగన్… ఓ ప్రత్యేకత
అచ్చెన్నాయుడు ఏమంటున్నారంటే…
ఎన్టీఆర్ సినిమాల ద్వారా తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తెలుగు వారిలో చైతన్యం తెచ్చారని అచ్చెన్నాయుడు అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయం, పరిపాలనలో అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. టీడీపీ పోరాటాలు చేసే పార్టీ అని పేర్కొన్న ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తామని ప్రకటించారు. మోడీ ప్రధాని అయ్యాడంటే దానికి కారణం ఎన్టీఆర్ అని అచ్చెన్నాయుడు ఆశ్చర్యకర కామెంట్ చేశారు.అయితే, ఏ లాజిక్ ప్రకారం అచ్చెన్నాయుడు ఈ కామెంట్ చేశారో ఆయనకే తెలియాలి.
Read More: Chandrababu: చంద్రబాబు పనితో దారుణంగా హర్టవుతున్న టీడీపీ శ్రేణులు
జగన్ సర్కారుపై ఎప్పట్లాగే…
ఎన్టీఆర్ జయంతి సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎప్పటిలాగే ఏపీ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నేడు పిల్ల కాకి సంక్షేమం కోసం మాట్లాడుతోందని ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. సంక్షేమం అంటే ఎన్టీఆర్ పెట్టిన పథకాలేనని తెలిపారు. ఏపీ లో అరాచక, రౌడీ పాలన నడుస్తుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజకీయం అంటే డైరెక్ట్ గా పోరాటం చేయాలని పేర్కొంటూ కానీ ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు, కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.