Atchannaidu : టీడీపీ TDP రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును ఆయన స్వగ్రామం srikakulam శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఈ రోజు ఉదయం పోలీసు అరెస్టు చేశారు. గ్రామ పంచాయతీ నామినేషన్ల సందర్భంలో వైసీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకుని దౌర్జన్యం చేశారన్న అబియోగంపై అచ్చెన్నతో సహా మరో 22 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మంగళవారం ఉదయం అచ్చెన్నాయుడును పోలీసులు భారీ బందోబస్తు నడుమ అరెస్టు చేసి కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే రోజు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిమ్మాడ పర్యటన పెట్టుకోవడం విశేషం. ఈ గ్రామంలో అచ్చెన్న కుటుంబీకులకు వ్యతిరేకంగా వైసీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అప్పన్నను పరామర్శించడానికి విజయసాయిరెడ్డి వస్తున్నట్లు ప్రచారం జరిగింది.
పోలీసులు అచ్చెన్న అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడుపై నమోదు చేసి తప్పుడు కేసును ఎత్తివేయాలని, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులకు జగన్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. నిమ్మాడలో గత నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి ఉద్రిక్తతలు లేవని చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్న అరెస్టును ఖండించారు. నేడు రాష్ట్రంలో వైఎస్ జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేయడం, మీడియా ముందు మాట్లాడారు. ఈ ఘటన జరిగిన 12గంటలలోపే విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపర్చారు. కారు అద్దాలను ద్వంసం చేశారు. ఈ ఘటనపైనా తీవ్రంగా స్పందించిన పార్టీ అధినేత చంద్రబాబు హుటాహుటిన విజయవాడ గురునానక్ కాలనీలోని పట్టాభి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టాభిపై దాడికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాభికి వ్యక్తిగతంగా ఎవరూ విరోధులు లేరని ప్రజల కోసమే పట్టాభి పోరాడుతున్నారని అన్నారు. పట్టాభిపై మొదటి సారి దాడి జరిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు చంద్రబాబు. ప్రశ్నిస్తే చంపేస్తారా అని మండిపడ్డారు.