Atmakur By Poll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కొనసాగుతున్న క్రమంలో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డికి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు బీ ఫారం అందజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ తో విక్రమ్ రెడ్డి భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుండి విజయం సాధించి జన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో దివంగత గౌతమ్ రెడ్డి సోదరుడైన విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా నిలపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మేకపాటి కుటుంబ సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా సీఎం జగన్ ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసి బీ ఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Atmakur By Poll: 23న ఉప ఎన్నికల పోలింగ్
ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతోంది. ఈ నెల 6వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. 26వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు. కాగా ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ గత సంప్రదాయాన్ని అనుసరించి పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. అయితే టీడీపీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని పోటీకి నిలుపుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే తెలిపారు.