ayyanna patrudu: ఏపి (AP)లో రాజకీయ నేతల మధ్య బూతు తిట్ల పురాణం ఇప్పట్లో ముగిసేలా లేదు. టీడీపీ (TDP) అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (పట్టాభి) Pattabhi రెండు రోజుల క్రితం ఏపి సీఎం జగన్ (CM YS Jagan) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు హర్ట్ అటు పట్టాభి నివాసంపై మరో పక్క టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారు. దీన్నే టీడీపీ అస్త్రంగా మారల్చుకుని అధికార వైసీపీని ఇబ్బందులు పెట్టడానికి చంద్రబాబు వ్యూహాన్ని సిద్దం చేసుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఆరాచక పాలన సాగుతోందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధం అయ్యారు. నేడు ఢిల్లీకి చంద్రబాబు బృందం బయలుదేరి వెళుతోంది. మరో పక్క హైకోర్టు నుండి పట్టాభికి ఉప శమనం లభించడంతో టీడీపీ నేతలు పట్టాభి ఉపయోగించిన వివాదాస్పద పదాన్ని వాడుతూ వైసీపీపై ఎదురుదాడి చేస్తోంది. వైసీపీ చర్యలను నిరసిస్తూ టీడీపీ నేతచంద్రబాబు 36 గంటల దీక్ష చేయగా, పట్టాభి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ జనాగ్రహ దీక్షలను నిర్వహించింది.
ayyanna patrudu: సింపథీ కోసమే పదానికి పెడ అర్ధాలు
ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మరో సారి జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై విమర్శలు గుప్పించారు. బొషిడికే అన్న పదానికి తెలంగాణ పదకోశంలో ఉన్న అర్ధాన్ని వివరించారు అయ్యన్న పాత్రుడు. పట్టాభి అసలు ఆ పదాన్ని సలహదారు సజ్జల ను ఉద్దేశించి అంటే దాన్ని సీఎం జగన్ తనకు తానే అన్వయించుకున్నారని విమర్శించారు. సింపతీ వస్తుందంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం వైఎస్ జగన్ అని మండిపడ్డారు. ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయ్ శవాల దగ్గరనుండి కోడికత్తి వరకూ దేనిని వదలని జగన్ రెడ్డి బోసిడికె పదాన్ని వదులుతాడా? అని ప్రశ్నించారు. తెలంగాణ పదకోశంలో బోసిడికె అంటే ‘పాడై పోయిన’ అనే అర్థముందని పేర్కొన్నారు. సానుభూతి కోసం ఎంతకైనా దిగజారే జగన్ రెడ్డి … సలహాల సజ్జలని బోసిడికె అంటే..అది తననే అన్నారని అన్వయించుకుని, బోస్డీకే పదానికి పెడార్ధాలు తీసి తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్ కార్డ్ బయటకి తీసాడని అన్నారు.
బూతులు తిట్టిన వారికి మంత్రిపదవులు
తల్లిపై నిజంగా ప్రేమ ఉంటే, తల్లిని బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులు ఇవ్వడనీ, తల్లిని, చెల్లిని అలా తెలంగాణ రోడ్లపై అనాథలుగా వదిలేయడని పేర్కొన్నారు. ఇంతకు ముందు జగన్ పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు నివాసంపైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రెండు వారాల వ్యవధిలోనే వైసీపీ అభిమానులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం గమనార్హం. ఈ తరుణంలో ఇరుపక్షాల నేతలు మధ్య విమర్శలు, ప్రతివిమర్శల దాడి కొనసాగుతోంది. ఈ వివాదం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో వేచి చూడాలి.