Breaking: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లాల్సిన దీక్షా స్వాములు విశాఖ రైల్వే స్టేషన్ లో ఆందోళనకు దిగారు. రైల్వే ట్రాక్ పై భైటాయించి నిరసన వ్యక్తం చేశారు. కొల్లం ఎక్స్ ప్రెస్ లో మూడు బోగీలు లేకపోవడంతో దీక్షా స్వాములు విస్మయానికి గురైయ్యారు.
కొల్లాం ఎక్స్ ప్రెస్ లో ఎస్ 8,9,10 బోగీలు అధికారులు పెట్టలేదు. తాము రిజర్వేషన్ చేసుకున్నా బోగీలు లేకపోవడంతో ఆందోళనకు గురైయ్యారు. తక్షణం అధికారులు స్పందించి బోగీలు ఏర్పాటు చేయాలని దాదాపు 50 మందికిపైగా దీక్షా స్వాములు రైల్వే స్టేషన్ లో నిరసనకు దిగారు. అయ్యప్ప దీక్ష స్వాములు ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షా స్వాములు ఆందోళన నేపథ్యంలో స్థానిక రైల్వే అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.