తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు , ఆయన తనయుడు నారా లోకేష్ కు ఓ టీడీపీ ముఖ్య నేత దిమ్మతిరిగే షాకిచ్చారట.
ఓ వైపు బాబు రాజకీయం రంజుగా సాగుతుంటే మరోవైపు ఆ నేత చేసిన పనికి పార్టీ రథసారథులు ఎలా కవర్ చేసుకోవాలో తెలియని స్థితిలో ఉన్నారని అంటున్నారు. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టు అయిన ఉదంతం.
అఖిలప్రియ కలకలం….
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియ.. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ కోసం ఆమె ప్రయత్నించగా గతంలో సికింద్రాబాద్ కోర్టు ఆమెకు బెయిల్ను నిరాకరించింది. ఇదే సమయంలో ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీస్ కస్టడీకి కూడా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెకు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న అఖిలప్రియకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో అఖిల ప్రియ నేడు చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
బాబు , లోకేష్ ఏం చేయాలో తెలియక….
కిడ్నాప్ కేసులో ఏ-1గా ఉన్న అఖిలప్రియకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వారి సన్నిహితుల్లో సంతోషం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , ఆయన తనయుడు నారా లోకేష్ విడుదల అవుతున్న భూమా అఖిలప్రియను పరామర్శిస్తారా? అంటే `నో` అనే సమాధానం వస్తోంది. గతంలో టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర విడుదల అయిన సమయంలో వారిని పరమర్శించిన ఈ ముఖ్య నేతలు అఖిలప్రియ విషయంలో అలా వ్యవహరించకపోవచ్చునని అంటున్నారు. ఇతర నేతల ఉదంతాలకు , అఖిలప్రియ కేసుకు ఎంతో తేడా ఉన్నందున ఇలా నడుచుకుంటారని చెప్తున్నారు.