MLC Ashok Babu: టీడీపీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. 20 వేల పూచికత్తుతో సీఐడీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ సర్వీసులో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న, రికార్డులు ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై అశోక్ బాబును గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం అర్ధరాత్రి నుండి దాదాపు 17 గంటల పాటు అశోక్ బాబును గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో ఉంచి విచారించారు. అనంతరం కోవిడ్ పరీక్షలు నెగిటివ్ రిపోర్టు రావడంతో అశోక్ బాబును న్యాయమూర్తి ఎదుట హజరుపర్చారు.
MLC Ashok Babu: అశోక్ బాబుకు బెయిల్
టీడీపీ నేతల ఆందోళన నేపథ్యంలో న్యాయమూర్తి నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అశోక్ బాబు ఆరోగ్యం సరిగా లేదనీ ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు లో సీఐడీ అధికారులు నిబంధనలు పాటించలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి అశోక్ బాబు కు బెయిల్ మంజూరు చేశారు. అశోక్ బాబుకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read more: AP CID: టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఏపి సీఐడీ..
హైకోర్టులో చుక్కెదురు
అంతకు ముందు అశోక్ బాబును అరెస్టు చేయడంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పిటిషన్ పై విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అశోక్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ అరెస్టు సమయంలో సీబీఐ నిబంధనలు పాటించలేదనీ, ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడిని ఆదేశించింది. మధ్యంతర బెయిల్ తిరస్కరిస్తూ తదుపరి విచారణను సోమవారంకు వాయిదా వేసింది.