హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేషన్ పై శుక్రవారం కేసు నమోదు అయ్యింది. నరేష్ పై కొడంగల్ పోలీస్ స్టేషన్ లో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రెండు రోజుల క్రితం ఓ సభలో హిందూ దేవుళ్లను, అయ్యప్ప స్వామిపై నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప దీక్షా స్వాములు నిరసనలు, రాస్తారోకోలు చేశారు. ఈ క్రమంలో కోస్గీలో వీడియోలు తీస్తూ అనుమానాస్పదంగా వ్యవహరించిన బహాలరాజు అనే వ్యక్తిపై అయ్యప్ప దీక్షా స్వాములు దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లోని మూడు పోలీస్ స్టేషన్ లలో నరేఫ్ పై ఫిర్యాదులు చేశారు. భైరి నరేష్ ను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలంటూ విశ్వహిందూ పరిషత్ (వీహిచ్పీ) నేతలు డిమాండ్ చేశారు.
ఫిర్యాదుల నేపథ్యంలో భైరి నరేష్ పై 295ఏ, 298, 153 ఏ, 505(2) సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు నరేష్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తొంది. రేపు రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మనోభాావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. శాంతికి విఘాతం కలిగించే వాళ్లను సమావేశాలకు పిలవవద్దని ఎస్పీ సూచించారు.