Balaiah Fans: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (బాలయ్య) టీడీపీ స్టాండ్ కు అనుగుణంగా రాజధాని అమరావతికి మద్దతు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోని బాలయ్య అభిమానులు మాత్రం మూడు రాజధానులకు మద్దతు తెలియజేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతు ర్యాలీలో బాలయ్య అభిమానులు పాల్గొనడం విశేషం.అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీపీ నాయకుడు నవీన్ నిశ్చల్ పార్టీ కార్యకర్తలతో కలిసి మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సాగుతున్న క్రమంలో దీనిలో పాల్గొన్న విద్యార్ధులు ఒక్క సారిగా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఆశ్చర్యానికి గురైయ్యారు. వైసీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై విద్యార్ధులను వారించి యధావిధిగా ర్యాలీని కొనసాగించారు.
Read More: Omicron Effect: జగన్ సర్కార్ కీలక నిర్ణయం..! మాస్క్ లేకపోతే మూడినట్లే..!!
Balaiah Fans: మూడు రాజధానులకు మద్దతుగా..
ఓ పక్క అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానం నుండి దేవస్థానం పేరుతో అమరావతి ప్రాంత రైతాంగం కోర్టు అనుమతితో తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం హైకోర్టులో మూడు రాజధానుల బిల్లులను ఉప సంహరించుకుంటున్నట్లు తెలియజేయడం తెలిసిందే. ఆ తరువాత అసెంబ్లీ, మండలిలోనూ ఆ బిల్లులను రద్దు చేస్తూ తీర్మానాలను ఆమోదించింది జగన్ సర్కార్. ఈ పరిణామం తరువాత రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత వైసీపీ శ్రేణులు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురంలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
Read More: AP Govt: ఏపి ప్రభుత్వ మరో వెనుకడుగు..! జీవో 59 విత్ డ్రా చేసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడి..!!