Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సొంత పార్టీ నేతలపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి దగ్గర బంధువు అయినప్పటికీ ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో ఆయనను పక్కను పెట్టిన సంగతి తెలిసిందే. మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై తొలుత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ సీఎం జగన్ తో భేటీ అనంతరం బాలినేని మెత్తబడ్డారు. తనకు ఎటువంటి అసమ్మతి లేదని తరువాత పేర్కొన్నారు. అయితే సొంత పార్టీ వాళ్లే తనపై కుట్రలు చేస్తున్నారని బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తనపై కుట్రలు చేస్తున్నవారు ఎవరో తనకు తెలుసుననీ, వాళ్ల సంగతి చూస్తానంటూ బాలినేని హెచ్చరించారు. తాను మద్యం సేవించి అర్ధరాత్రి జనసేన పార్టీకి చెందిన మహిళకు ఫోన్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం వెనుక ప్రతిపక్ష టీడీపీ ఉందన్నారు. తను తప్పు చేసినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని బాలినేని ప్రకటించారు. తన కుమారుడిపైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఓపిక నశించే విధంగా టీడీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బాలినేని. ఓ కేసు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్డప్తి చేస్తేనే ఉపసంహరించుకున్నాననీ, ఆయన కూడా నిజాలు తెలుసుకోవాలని బాలినేని అన్నారు. క్యారెక్టర్ తో తాను జీవిస్తున్నాననీ, చిల్లర రాజకీయం చేయననీ అన్నారు బాలినేని.