Bandi sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విరుచుకుపడే సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్న నీటి పంపకాల విషయంలో బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలని మండిపడ్డారు. డ్యామ్ ల దగ్గర ఎందుకు బందోబస్తు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసుల మధ్య ఘర్షణ పేరుతో కొత్త నాటకం తెరలేపే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
Read More: KCR: ఉప ఎన్నికకు అప్పుడే ఎత్తుగడ వేసేసిన కేసీఆర్
నోట్లో మట్టి కొట్టినవ్ కేసీఆర్…
తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అమ్మేసిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 TMCలకు ఒప్పుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో సీఎం కేసీఆర్… ఏపీ సీఎంతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆరోపించారు. ఏపీతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందాలు తప్పని నిరూపిస్తే, శ్రీశైలం డ్యామ్లో దూకి చనిపోతానంటూ బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందాలు నిజమే అని తేలితే కేసీఆర్ ముక్కు నేలకు రాసి…పొర్లు దండాలు పెడుతూ ప్రజలకు క్షమాపణ చెబుతారా అంటూ సవాల్ విసిరారు.
Read More: KCR: హుజురాబాద్లో ఈటల దిమ్మతిరిగిపోయే గేమ్ అమలు చేస్తున్న కేసీఆర్
కేంద్రం జోక్యం చేసుకుంది కాబట్టే…
తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి తెలంగాణకు అన్యాయమే చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ అప్పుడు చంద్రబాబుతో.. ఇప్పుడు జగన్ తో కుమ్మక్కయ్యారని బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఇన్వాల్వ్ అయింది కాబట్టే… ఏపీ కడుతున్న సంగమేశ్వర ప్రాజెక్టు ఆగిందని సంజయ్ తెలిపారు.