Lock Down: కరోనా కలకలం కొనసాగుతున్న సమయంలో లాక్ డౌన్ హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో తప్పుడు వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఓ వైపు కర్ఫ్యూ మరోవైపు లాక్ డౌన్ వార్తలు పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఫలానా తేదీ నుంచి లాక్ డౌన్ అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూపై తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్న సోషల్ మీడియా పోస్టింగ్స్ పై సైబర్ పోలీసులు ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియాలోని పోస్టింగ్స్ ఆధారంగా కేసులు బుక్ చేస్తున్నారు. అందుకే బీ కేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
లాక్ డౌన్ గురించి…
ఇప్పటికే వివిధ రూపాల్లో తప్పుడు వార్తలు వైరల్ అంటున్నారు. న్యూస్ చానెల్స్ బ్రేకింగ్ గ్రాఫిక్ ప్లేట్స్, విజువల్స్ను మార్ఫింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. గతేడాది జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ వీడియోలతో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న వారిపై నిఘాపెట్టారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ పోస్టింగ్స్ను పరిశీలిస్తున్నారు. వీడియోలు, వాట్సాప్ గ్రూప్ ఆధారంగా సుమోటో కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. స్పెషల్ బ్రాంచి అందించే సమాచారంతో సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఐటీ సెల్, సైబర్ క్రైమ్ టీమ్స్ తో డేటా కలెక్ట్ చేస్తున్నారు. రూమర్స్ పోస్టింగ్ చేస్తున్న వారిని గుర్తించేలా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సపోర్టు తీసుకుంటున్నారు.
బీ కేర్ ఫుల్…
ఈ నెల 30 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ఫేక్ జీవోను క్రియేట్ చేసిన చార్టెడ్ అకౌంటెంట్ సంజీవ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ తో పాటు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లోనూ ఫేక్ న్యూస్ పోస్టింగ్స్, షేరింగ్స్ జరుగుతున్నట్లు తేల్చారు. పోస్టింగ్ తీవ్రతను బట్టి యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ చేసే గ్రూప్ అడ్మిన్స్ను కూడా బాధ్యులుగా చేసేందుకు ప్లాన్ చేశారు.