Bhuma Akhila priya: ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు నమోదు అయ్యింది. బోయినపల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియతో సహా భర్త, సోదరుడు సహనిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. కిడ్నాప్ కేసులో ఈ నెల 3వ తేదీన వీరు కోర్టు హజరుకావాల్సి ఉండగా కరోనా కారణంగా విచారణకు హజరు కాలేమని పేర్కొంటూ ఈ నెల 1వ తేదీన ధృవపత్రాన్ని సమర్పించారు.
Read More: IPS officers: ఏపిలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
అయితే వీరు సమర్పించిన కోవిడ్ సర్టిఫికెట్లను బోయినపల్లి పోలీసులు పరిశీలన చేశారు. దృవ పత్రం ఇచ్చిన ఆసుపత్రికి వెళ్లి పోలీసులు విచారించగా అవి నకిలీ సర్టిఫికెట్లు అని గుర్తించారు. దీంతో కోర్టుకు నకిలీ దృవపత్రాలను సమర్పించారన్న అభియోగంపై అఖిలప్రియ భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి లపై, అదే విధంగా నకిలీ దృవ పత్రం ఇచ్చిన ముగ్గురు ఆసుపత్రి సిబ్బందిపైనా బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన నేపథ్యంలో భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.