Bhuma Akhila Priya: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పోలీసులపై తీవ్ర ఆరోపణ చేశారు. ఓ టీవీ ఛానల్ తో అఖిలప్రియ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డలో అభివృద్ధి పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన అఖిల ప్రియ వాటిని ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. ప్రజల కోసం తన తండ్రి భూమా నాగిరెడ్డి బస్ షెల్టర్ కట్టిస్తే ఆ షెల్టర్ ను కూల్చివేశారన్నారు. షెల్టర్ కూల్చివేతను అడ్డుకున్న తన తమ్ముడు జగత్ విఖ్యాతరెడ్డిపై కేసులు పెట్టారని అన్నారు. ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండా పబ్లిక్ ప్రాపర్టీ అయిన బస్ షెల్టర్ ను కూల్చివేశారనీ, దాన్ని ప్రశ్నించినందుకు తన సోదరుడిపై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు అఖిలప్రియ.
Bhuma Akhila Priya: అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తా
తన తమ్ముడు తప్పు చేశాడని నిరూపిస్తే తానే తన తమ్ముడిని పోలీసుల వద్దకు తీసుకువెళతానని అన్నారు. పోలీసుల నుండి తన తమ్ముడు జగత్ విఖ్యాత రెడ్డికి ప్రాణహాని ఉందని అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. బస్ షల్టర్ కూల్చివేత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బాధితుల తరపున తాను న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు అఖిల ప్రియ.
Read More: CM YS Jagan: అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశం..ప్రస్తుత పరిస్థితిలో ఇది తప్పేలా లేదు.