Bhuma akhila priya : రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలన వార్త అయిన బోయనపల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ TDP కి చెందిన ఏపి మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు అయి బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు పరారీలో ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారో ఇంకా తెలియలేదు. అయితే అఖిలప్రియ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సాధారణంగా తమ పార్టీ వ్యక్తులపై దాడులు జరిగినా, అరెస్టులు చేసినా ఇంకేదైనా బాధల్లో ఉన్నా పరామర్శించే చంద్రబాబు.. అఖిలప్రియ విషయంలో ఎందుకో సైలెంట్ గా ఉండిపోయారు. బోయినపల్లి ఏపిసోడ్ జరిగిన తరువాత చంద్రబాబు గానీ, ఆ పార్టీ నేతలు గానీ స్పందించలేదు. మాట్లాడలేదు. కనీసం బెయిల్ పై వచ్చిన తరువాత కూడా చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఎవరూ ఆమెను పరామర్శించలేదని వార్తలు వస్తున్నాయి. భూమా వర్గీయులు మాత్రం టీడీపీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మరో వర్గాన్ని ప్రోత్సహించేందుకే అఖిలప్రియ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు భావిస్తున్నారు. వీటిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా బెయిల్ పై వచ్చిన తరువాత అఖిలప్రియ చంద్రబాబును కలిసే ప్రయత్నం చేయగా అపాయిట్మెంట్ లభించలేదని టాక్. కనీసం ఫోన్ ద్వారా మాట్లాడేందుకు కూడా అవకాశం లబించలేదుట. ఒక వేళ నేరుగా కలిసేందుకు ప్రయత్నిస్తే అవమానకర పరిస్థితి ఎదురవుతుందని భావించి అఖిలప్రియ కలవడం లేదని ఆ ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. అఖిలప్రియ విషయంలో టీడీపీ నేతలు అనుసరిస్తున్న వ్యవహార శైలిని మాత్రం ఆమె వర్గీయులు ఆక్షేపిస్తున్నారు.
మరో పక్క కిడ్నాప్ కేసులో ఉన్న ఆమె భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టేసింది. దీంతో వారు అజ్ఞాతంలో ఉండిపోయారు. వీరి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.