Big Breaking: విశాఖ జిల్లా అనకాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్ పిల్లర్ కుప్పకూలి రహదారిపై వెళుతున్న వాహనాలపై పడింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ద్వంసం అయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
బ్రిడ్జ్ పిల్లర్ పెద్ద శబ్దంతో కూలిపోవడంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. కూలిన వంతెన కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలియడంతో హైవే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.