Big Breaking: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను ఏపి సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల టెన్త్ క్లాస్ పరీక్షా పత్రాల లీకేజీ లో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందని పోలీస్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఏపి సీఐడీ అధికారులు హైదరాబాద్ కొండాపూర్ కు వెళ్లి నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షల ప్రారంభంలో పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నా పత్రాలను వాట్స్ ఆప్ ద్వారా పలువురికి పంపిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రశ్నా పత్రాల లీకేజీ అంశంలో పది మందికిపైగా ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ విద్యాసంస్థ అధినేత అయిన టీడీపీ మాజీ మంత్రి నారాయణను ఏపి సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు.. నారాయణతో పాటు ఆయన సతీమణి రమాదేవిని సైతం హైదరాబాద్ నుండి ఏపికి తరలిస్తున్నారు.