Big Breaking: మూడు రాజధానుల అంశంపై జగన్మోహనరెడ్డి సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సీఆర్డీడీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు సంబంధించి కేసులు హైకోర్టు రోజు వారి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నది మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అడ్వొకేటే జనరల్ రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు.
ఈ నెల 15వ తేదీ నుండి హైకోర్టులో రోజు వారి విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి కొద్ది సేపటిలో జరిగే కేబినెట్ అత్యవసర భేటీలోనూ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకోనున్నది. తరువాత పలు మార్పులతో పరిపాలనా వికేంద్రకరణ బిల్లును ప్రభుత్వం ఆసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది.