Big Breaking: కోర్టు దిక్కరణ కేసులో ఏపి హైకోర్టు నేడు కీలక తీర్పు ఇచ్చింది. ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ లకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఐఏఎస్ లకు రెండు వారాల పాటు ఏపి హైకోర్టు జైలు శిక్ష విధించింది. అయితే హైకోర్టు ఈ శిక్ష విధించిన వెంటనే ఐఏఎస్ అధికారులు ధర్మాసనానికి క్షమాపణలు కోరారు. దీంతో జైలు శిక్ష బదులుగా ఏడాది పాటు ప్రతి నెల ఒక రోజు సంక్షేమ హాస్టల్ కు వెళ్లి సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఏడాది పాటు సంక్షేమ హాస్టల్ లో నెలకు ఒక రోజు వారి స్వంత ఖర్చులతో భోజనం పెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్ విజయ్ కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్, వాడ్రేపు చిన వీరభద్రుడు. ఎంఎం నాయక్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు పాటించకుండా పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయ భవనం నిర్మాణం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం కోర్టు దిక్కరణ కింద సదరు ఐఏఎస్ అధికారులకు శిక్ష విధించింది.