Big Breaking : జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. బిజెపి దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిన్న జనసేన, బిజెపి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించగా, నేడు ఎస్ ఈ సీ తరపున సీనియర్ న్యాయవాది మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఎస్ ఈ సీ ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవటం తగదని, గతంలో తీర్పులను ఉటంకించారు. కాగా జనసేన నిన్న దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని ఎస్ ఈ సీ ని హైకోర్టు ఆశిస్తూ తదుపరి విచారణను 6వ తేదికి వాయిదా వేసింది. పరిషత్ ఎన్నికల సంబంధించి ఎన్నికల సంఘం రీ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పు పడుతూ జనసేన బీజేపీలు హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.