Big Breaking: ఏపిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సన్నద్దం అయ్యింది. రేపటి నుండి నైటే కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10గంటల నుండి ఉదయం 5గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు.
అదే విధంగా 18 నుండి 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2,04,70,364 మందికి వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నారు. మే 1వ తేదీ నుండి ఈ వయస్సు వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారు. 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వానికి రూ.1600 కోట్లు అవుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా కట్టడిపై సీఎం వైఎస్ జగన్
చర్చించారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వ్యాక్సిన్ ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితిలో కర్ఫ్యూ విధించకపోతే కరోనా కేసులు ఆగే అవకాశం లేదని నిపుణులు సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది.