ఇటీవల అనంతపురం మాజీ ఎంపీ టిడిపి పార్టీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఆమరణ దీక్షకు రెడీ అయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుండి వైసీపీ ప్రభుత్వంపై జేసీ బ్రదర్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జేసీ బ్రదర్స్ పై చాలా కేసులు నమోదు అయ్యాయి. అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ మిషన్లో ఆధారాలతో సహా దొరికిపోవడం మాత్రమే కాక ఇంకా అనేక విషయాలలో వారిపై పోలీసులు కేసులు పెట్టడం జరిగింది.
ఇదే క్రమంలో తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే నేరుగా జేసీ ఇంటి లోకి వెళ్లి వార్నింగ్ ఇవ్వటానికి వెళ్ళటం.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ తతంగం ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇటువంటి నేపథ్యంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల ఆమరణ దీక్షకు కూర్చోవాలని ప్రయత్నించగా పోలీసులు భారీ ఎత్తున రావడంతో జేసీ వర్గానికి పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాటలు జరిగాయి.
ఈ క్రమంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై బండ బూతులు తిట్టడంతో పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ లో జేసీ పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. తమ ని దారుణంగా విమర్శించాడమే కాకుండా కొడతా కి వచ్చారు అంటూ ఐపీసీ సెక్షన్ 353, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాను ఎవరినీ దూషించలేదు అని అసత్య ప్రచారం చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మరోపక్క జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను తిట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.