Big Breaking : తిరుపతి Tirupati ఉప ఎన్నికలలో బీజేపి Bjp అభ్యర్థిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ ias అధికారిణి రత్నప్రభకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. రత్నప్రభ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో కొన్ని విషయాలను వెల్లడించలేదంటూ జనతాదళ్ (యు) నేత ఏవి రమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాల్లో తనపై ఏ కేసు లేదని రత్నప్రభ పేర్కొన్నారనీ, అయితే ఆమెపై బంజారాహిల్స్, సైఫాబాద్, హనుమంతుపాడు పోలీస్ స్టేషన్లలో అయిదు కేసులు పెండింగ్ లో ఉన్నాయని రమణ ఆరోపించారు. వీటికి సంబంధించిన ఆధారాలను ఎన్నికల అధికారికి సమర్పించినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.
ఆమె కుల దృవీకరణ పత్రాలకి రికార్డులు లేవని పేర్కొన్నారు. ఓ పక్క కర్నాటకలో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గా పని చేస్తూ, పెన్షన్ పై జీవిస్తున్నట్లు తెలిపారని ఆరోపించారు. తప్పుడు పత్రాలతో నామినేషన్ దాఖలు చేయడం, అఫిడవిట్ లో పూర్తి సమాచారం ఇవ్వకపోవడం వల్ల రత్నప్రభ నామినేషన్ ను వెంటనే తిరస్కరించాలని రమణ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై రత్నప్రభ, ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.