Big Breaking: సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఏపి ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు లోగా పరీక్షలు నిర్వహణ అసాధ్యమని తెలిపారు. జూలై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు.
కరోనా నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తామంటూ ఇప్పటి వరకూ ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు సిద్ధపడటంతో పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిన్న పరీక్షలు నిర్వహిస్తామని ఏపి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ నేడు సుప్రీం కోర్టు పరీక్షల నిర్వహణపై ఏపికి ప్రశ్నల వర్షం కురిపించడంతో పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకున్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?