Big Breaking: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి సమీపంలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో పెళ్లి బస్సు బోల్తా కొట్టింది. సుమారు 50 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. ధర్మవరం నుంచి తిరుపతికి బయలుదేరిన ఈ ప్రైవేటు టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో 40 మందికిపైగా గాయపడగా క్షతగాత్రులను తిరుపతి రిమ్స్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాహనదారులు, ప్రయాణీకులు సహాయ చర్యల్లో పాలుపంచుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది వరకూ ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.