Big Breaking: తిరుపతి రూయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పది మందికిపైగా మృతి చెందారు. ఐసీయూలోని 13 మంది కరోనా బాధితులు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. అత్యవసర శ్వాస ఆడించేందుకు వైద్యులు సీపీఆర్ చేశారు. ఆక్సిజన్ ట్యాంకు ఖాళీ కావడంతో 25 నిమిషాల పాటు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. దీంతో పది మందికిపైగా కరోనా బాధితులు మృతి చెందారని తెలుస్తోంది. తమిళనాడు నుండి ఆక్సిజన్ రవాణా ఆలస్యం అయ్యిందని అధికారులు పేర్కొంటున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ రాకతో సరఫరాను పునరుద్ధరించారు. బాధితులకు వైద్యులు ఆక్సిజన్ అందిస్తున్నారు.
రూయా ఘటనపై సీఎం జగన్ ఆరా
రూయా ఆసుపత్రి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించారు. ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.