Big Breaking: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఆదివారం ఆర్ధరాత్రి దాటిన తరువాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో పది మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
రహదారిపై గేదె చనిపోయి పడి ఉండటంతో అది గమనించని టాటా మ్యాజిక్ వాహనం అతివేగంగా వచ్చి దానిపై ఎక్కడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. టాటా మ్యాజిక్ ఆటోలో ప్రయాణం చేస్తున్న సుమారు 14 మంది ప్రమాదానికి గురైయ్యారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.