Big Breaking : ఏపిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సారిగా ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నది. మండల పరిషత్, జడ్పీటీసి ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించకముందే మంత్రులే ఎన్నికల తేదీలను ఎలా ప్రకటిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
రాష్ట్రంలో రాజ్యాంగ స్పూర్తిగా విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే అఘమేఖాల మీద ఎస్ఈసీ ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేశారని అన్నారు. ఉదయం నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించిన అనంతరం ఈ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నది. టీడీపీ ఆవిర్భావం తరువాత స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడం ఇది తొలి సారి. ఏపిలో ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ స్థానిక ఎన్నికలను బహిష్కరించిన దాఖలాలు లేవు. తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించిన సందర్బాలు ఉన్నాయి. ఇప్పుడు అదే తమిళనాడు సంస్కృతి ఏపికి వచ్చిందని అనుకుంటున్నారు.