Son of India: మంచు మోహన్ బాబు.. తెలుగు సినిమాల్లో ఆయన కలెక్షన్ కింగ్. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా 500 పైగా సినిమాలు, 60 పైగా సినిమాల నిర్మాణం.. ఇలా టాలీవుడ్ లో ఆయన ప్రస్థానం ఓ చరిత్ర. అటువంటి మోహన్ బాబు ఇప్పుడు మరో చరిత్ర సృష్టించారు. మూడేళ్ల తర్వాత ఆయన పూర్తిస్థాయిలో నటించిన సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. నేటి రోజుల్లో విడుదలైన మొదటి మూడు రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్లే సినిమా స్థాయి చెప్పే పరిస్థితి. ఈనేపథ్యంలో మోహన్ బాబు సినిమా విడుదలై మొదటి మూడు రోజులు కాదు కదా.. మొదటి రోజే మూడు షోలు కూడా పడలేదు. అదీ టికెట్లు తెగక.. కలెక్షన్లు లేక..!
ఓ రేంజ్ లో ట్రోలింగ్..
ఇటివల మోహన్ బాబు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ తో బాగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. మా ఎన్నికల సమయంలో ఆయన కుమారుడు విష్ణు చేసిన వ్యాఖ్యలు.. ఇటివల సీఎం జగన్ తో మీటింగ్ పై చేస్తున్న వ్యాఖ్యలు బాగా ట్రోల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో మా ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగానే మంచు ఫ్యామిలీ కామెంట్స్ ఇందుకు మరింత ఆజ్యం పోశాయని చెప్పాలి. ఈ ఎఫెక్ట్ సినిమాపై ఏస్థాయిలో పడిందంటే.. ఏపీలో 150కి పైగా ధియేటర్లలో మార్నింగ్ షో తర్వాత సినిమా తీసేసేంతగా..! చిత్తూరులో ఓ ధియేటర్లో 5గురు, విశాఖపట్నంలో 9మందితో సినిమా పడిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుత మోహన్ బాబు పరిస్థితికి అటు టీడీపీ, ఇటు మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారనడంలో సందేహం లేదు.
ప్రేక్షకులిచ్చిన కొత్త తీర్పు..
పాలిటిక్స్ కి దూరమైనట్టు ప్రకటించినా మోహన్ బాబు వైసీపీ వర్గీయుడే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన్ను మోహన్ బాబు దూషించిన తీరు ఎవరూ మర్చిపోలేనిది. కాబట్టి.. ఇప్పుడు మోహన్ బాబును చూసి టీడీపీ వర్గీయులు మరో రేంజ్ లో ఆడుకుంటారని చెప్పాలి. ఇటు మెగా ఫ్యాన్స్.. ప్రస్తుతం మోహన్ బాబు పరిస్థితికి సగం కారణం వారే. ఎదుటి వ్యక్తిపై నిర్లక్ష్యపు అతివాగుడు, స్వార్థం, నిలకడలేనితనం, మర్యాద, మాటలో గౌరవం లేకుండా వారు చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు సమాధానం చెప్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. ప్రజల్లో తమ వ్యాఖ్యల ద్వారా చులకన కావడం.. సరైన అభిప్రాయం లేకుండా రాజకీయంలో రంగులు మార్చడం ఓ హీరోకు ప్రజలు సినిమా ద్వారా ఇచ్చిన తీర్పుగా చెప్పాలి..!