AP Dy CM Puspa Sreevani: ఏపి డిప్యూటి సీఎం పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్ లభించింది. కుల వివాదం కేసులో ఆమెకు ఊరట లభించింది. ఆమె ఎస్టీయే నంటూ అప్పీలేట్ అథారిటీ తేల్చి చెప్పింది. పాముల పుష్ప శ్రీవాణి ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం కురుపాం నుండి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా గెలిచారు. మొదటి సారి 2014 లో 19వేల పైచిలుకు మెజార్టీతో పుష్ప శ్రీవాణి గెలిచిన సమయంలోనే గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్సు కోర్టులో ఆమె ఎస్టీ కాదంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు కోర్టులో నడుస్తుండగా పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయలేదు.
AP Dy CM Puspa Sreevani: ఆమె ఎస్టీయే
రెండవ సారి 2019 ఎన్నికల్లో 26వేల పైచికులు ఓట్ల మెజార్టీతో పుష్ప శ్రీవాణి గెలిచారు,. దీంతో ఆమెను ఎస్టీ కోటాలో సీఎం జగన్మోహనరెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో ఇవ్వడంతో పాటు గిరిజన సంక్షేమ శాఖను అప్పగించారు. ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రత్యర్ధులు మళ్లీ ఆమె కుల వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. పుష్ప శ్రీవాణి కుల వివాదానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆమె ఏ కులమో తేల్చాలంటూ అప్పీలేట్ అథారిటీని ఆదేశించింది హైకోర్టు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అప్పీలేట్ అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది. ఆమెది ఎస్టీకి సంబంధించి కొండదొర సామాజిక వర్గమని తెలిపింది. అప్పీలేట్ అథారిటీ ఆమె ఎస్టీ అని తేల్చడంతో ఆమెకు భారీ ఊరట లభించింది.
Read More: Jagan KCR: మోడీతో జగన్, కేసిఆర్ అప్పుడు ఊ.. అంటారా..? ఊహూ.. అంటారా..?