BJP: ఏపి రాజకీయాల్లో ఏదో ఒక వివాదం హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్ పై చేసిన వ్యాఖ్యలకు పలు రాజకీయ పక్షాల నుండి తీవ్ర విమర్శలు కొనసాగుతున్న సమయంలోనే మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ జాతీయ నేత సత్యకుమార్. గుంటూరులోని జిన్నా టవర్ పై ఆయన తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
BJP: జిన్నా టవర్ పేరు మార్చాలి
గుంటూరు పట్టణంలోని జిన్నా టవర్ ఫోటోను బీజేపి నేత సత్యకుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ.. ఆ టవర్ పేరు మార్చాలంటూ సూచన చేశారు. “ఈ టవర్ కు జిన్నా పేరు మీద నామకరణం చేశారు. అంతే కాకుండా ఈ ఏరియాను జిన్నా సెంటర్ గా పిలుస్తారు. ఇది ఉంది పాకిస్తాన్ లో కాదు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో. దేశ ద్రోహి అయిన ఆలీ జిన్నా పేరును ఇంకా టవర్ కు కొనసాగిస్తున్నారు. ఈ టవర్ కు భరత మాత ముద్దు బిడ్డ అయిన అబ్దుల్ కలాం పేరో, దళిత రచయిత గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టరు? ఒక సూచనగా చెబుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
మరో పక్క ఆ టవర్ పేరు మార్చచకపోతే కూల్చేస్తామటూ బీజేపి నాయకులు, గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపి ప్రభుత్వం వెంటనే జిన్నా సెంటర్ పేరు మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే బీజేపీ కార్యకర్తలు జిన్నా టవర్ ను కూలగొట్టండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. మరో పక్క ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డిలు సత్యకుమార్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్వీట్ చేశారు.
This tower is named after Jinnah & area as Jinnah Centre
Irony,it’s not in Pakistan but in Guntur City of AP.
A centre that still carries the name of traitor of India.
Why shouldn’t it be named after Dr Kalam or son of the soil,a great Dalit poet,Gurram Jashuva?
Just an idea! pic.twitter.com/69tgWRsIMb
— Y. Satya Kumar (@satyakumar_y) December 30, 2021