BJP: ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక అనివార్యం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. వైసీీపీ రెబల్ ఎంపిగా ఉన్న రఘురామ కృష్ణంరాజు త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సై అన్నబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే వైసీపీకి రాజీనామా చేసే రఘురామ బీజేపీ చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా నరసాపురం ఉప ఎన్నిక బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసినా రాష్ట్రంలో అధికార వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీ మద్దతు కూడా రఘురామ తీసుకోనున్నారు.
BJP: వైసీపీ వ్యతిరేక పార్టీల మద్దుతుతో
వైసీపీని వ్యతిరేకించే అన్ని పార్టీల మద్దతుతో తాను పోటీ చేయనున్నట్లుగా రఘురామ తెలిపారు. మరో పక్క రాష్ట్రంలో ప్రస్తుతం రాజధాని సమస్య హాట్ టాపిక్ ఉంది. వైసీపీ సర్కార్ హైకోర్టులో మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నా త్వరలో మెరుగైన బిల్లు తీసుకుని వస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతో మూడు రాజధానుల విషయంలో వైసీపీ సర్కార్ వెనుకడుగు వేయలేదని స్పష్టం అవుతోంది.
రాజధాని ప్రచార అస్త్రంగా..
ప్రధాన మంత్రి మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి ప్రాభవాన్ని పూర్తిగా తగ్గించేసి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడాన్ని ఇతర రాజకీయ పక్షాలతో పాటు బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు బీజేపీ తరపున ఉప ఎన్నికలో పోటీ చేయనున్న రఘురామ అమరావతి రాజధాని అంశాన్ని ప్రచార అస్త్రంగా మరల్చుకోనుండటంతో ఈ అంశం రెఫరెండంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల అమరావతి రైతుల మహా పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొని మద్దతు తెలుపకపోవడంపై అమిత్ షా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అమిత్ షా సూచనల తరువాత బీజేపీ నేతలు అందరూ అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలోకేంద్ర బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రెస్టేజీగా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.