Bjp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క పంచాయతీ ఎన్నికలలో వైసిపి పార్టీ 2019 ఎన్నికల తరహాలో హవా కొనసాగిస్తూనే ఉండగా మరోపక్క ప్రతిపక్షాలు స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీని గట్టిగానే కార్నర్ చేస్తూ ఉన్నాయి. పార్టీలకతీతంగా చాలామంది నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడాన్ని తప్పు పడుతున్నారు. ఈ విషయంలో కేంద్రం పునరాలోచించాలని కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్..వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లెటర్ రాయడం జరిగింది.
మరోపక్క ప్రతిపక్షాలు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో ఈ విషయంపై మంతనాలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా స్పందించారు. ఈ విషయం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి మాట్లాడతాను అంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ కారుచౌకగా అమ్మడానికి వీలు లేదు అంటూ కూడా పేర్కొన్నారు. మరో పక్క కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను వైస్సార్సీపీ ప్రభుత్వ సొంత నిధులతో చేపట్టినట్లు తెగ హడావిడి చేస్తోంది అంటూ మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూనే మరోపక్క వైసీపీ ప్రభుత్వం ఏదో వాళ్లే సొంతంగా ప్రవేశపెడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని వైసీపీ నేతల పై సోము వీర్రాజు సీరియస్ వ్యాఖలు చేశారు. ఏది ఏమైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చాలా రాజకీయ పార్టీ నేతలు ఇన్వాల్వ్ అవుతూ ఉద్యమం చేపట్టే దిశగా అడుగులు అడుగులు వేయటం ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణానికి తెర లేపుతోంది.