Badvel By Poll: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా బద్వేల్ లో వైసీపీ దొంగ ఓట్లు వేయించుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఆ పార్టీ నేత విష్ణు వర్ధన్ రెడ్డిలు ట్విట్టర్ వేదికగా పోలింగ్ తీరుపై ఆరోపణలు చేస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద తీసిన వీడియోలను పోస్టు చేశారు. గతంలో తిరుపతి – నేడు బద్వేల్, చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో కూడా దొంగ ఓట్లకు వైసీపీ నేతలు తెర తీశారని సోము వీర్రాజు విమర్శించారు. అట్లూరు మండలంలోని పోలింగ్ బూతులకు సరిహద్దు గ్రామాల నుండి ప్రజలను తీసుకువచ్చి బాహాటంగా దొంగ ఓట్లు వేయించుకుంటున్న వైసీపీ.వేయించుకుంటోందని పేర్కొంటూ ఆ పోలింగ్ వద్ద ఇతర ప్రాంతాల వారు వచ్చిన వీడియో ను షేర్ చేశారు.
Badvel By Poll: ఇదీ ఒక గెలుపేనా ?
డబ్బులు పంచి ఓట్లు వేయించుకోవడం కూడా ఒక గెలుపేనా?, బద్వేల్ 21వ వార్డ్ కౌన్సిలర్ భూమా రెడ్డి ఓటర్లకు నేరుగా డబ్బులు పంచుతున్నాడు, బద్వేల్ లో ఓట్లు వేసేవారు లేక పక్క జిల్లాల నుంచి తెచ్చుకుంటున్నారు, ఇలాంటి గెలుపు కూడా ఒక గెలుపేనా? , అట్లూరు మండలంలో పోలీసులు వైసిపి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపించిన సోము వీర్రాజు ఇది జగన్ రెడ్డి గారి ప్రజాదరణ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఏజెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారంటూ ఆరోపణలు గుప్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు లేకపోవడంతో స్థానిక పోలీసులే ఉంటున్నారని పేర్కొన్నారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులు తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలు అయినా, బద్వేల్ ఉప ఎన్నిక అయినా వీరు రక్షక భటులు కాదు ప్రేక్షక భటులు అంటూ బీజేపీ ఓ వీడియోను విడుదల చేసింది. పోలింగ్ బూత్ వద్ద జనాలు వెళుతున్నా విధి నిర్వహణ ఉన్న కానిస్టేబుల్ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్న వీడియోను షేర్ చేసింది బీజేపి.
పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీలేదు
బద్వేల్ లో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా ఏమీలేదనీ, వైసీపీ కార్యకర్తల కంటే ఘోరంగా వైసీపీకి పోలీసులు సహకరిస్తున్నారని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని హౌస్ అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి ..దొంగ ఓట్లతో గెలిచేది ఒక గెలుపేనా అని ప్రశ్నించారు. నాడు తిరుపతిలో ఏ రకంగా అయితే దొంగ ఓట్లు వేశారో దాన్నే ,బద్వేల్ లో పునరావృత్తం చేశారని విమర్శించారు. పోలీసులే దొంగ ఓట్లను ప్రోత్సహించడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
ఆ ఆరోపణల్లో నిజం లేదు
కాగా బీజేపీ నేతలు ఈ రకమైన ఆరోపణలు చేస్తుండగా ఏపీ సీఇఓ విజయానంద్ వాటిని ఖండించారు. ఇతర ప్రాంతాల నుండి జనాన్ని తరలిస్తున్నారని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందని, పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని విజయానంద్ వెల్లడించారు.
గతంలో తిరుపతి – నేడు బద్వేలు.
చివరికి ముఖ్యమంత్రి @ysjagan గారి సొంతజిల్లాలో కూడా దొంగ ఓట్లకు తెరతీసిన @YSRCParty నాయకులు.
అట్లూరు మండలంలోని పోలింగ్ బూతులకు సరిహద్దు గ్రామాల నుండి ప్రజలను తీసుకువచ్చి బాహాటంగా దొంగ ఓట్లు వేయించుకుంటున్న వైసీపీ.#BadvelByPollComplaints pic.twitter.com/OMfiXTf9pI
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) October 30, 2021
తిరుపతి అయినా,బద్వేలు అయినా వీరు రక్షక భటులు కాదు ప్రేక్షక భటులు.
ఎంచక్కా రాజ్యాంగం ప్రకారం జీతాలు తీసుకుంటూ,అదే రాజ్యాంగానికి @YSRCParty నాయకులు తూట్లు పొడుస్తుంటే సినిమా చూస్తున్నారు.
మీరు చేస్తున్న ఈ దిగజారుడు పనులకు సిగ్గుపడాలి! @dgpapofficial#BadvelByPollComplaints pic.twitter.com/vSJV1QTQiw
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) October 30, 2021