Rushikonda: విశాఖలోని రిషికొండ తవ్వకాల అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. రిషికొండపై గతంలో ఉన్న రిసార్ట్స్ ను వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత తొలగించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతన నిర్మాణాల కోసం తవ్వకాలు చేపడుతోంది. దీనిపై వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ఎన్జీటీని ఆశ్రయించగా అక్కడ తవ్వకాలు జరపవద్దని, నిర్మాణాలు చేపట్టవద్దని స్టే విధించింది, అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా కేసు విచారణను హైకోర్టుకు బదిలీ చేస్తూ ఎన్జీటీ ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని, పాత భవనాల స్థలాలో నిర్మాణాలు చేసుకోవచ్చని వెసుబాటు ఇచ్చింది. మరో పక్క రుషికొండ లో తవ్వకాలపై ఎన్జీటీతో మరో పిటిషన్ దాఖలైంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు తీవ్ర విమర్శలు చేశారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్లకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు జీవీఎల్. రుషికొండలో ఉన్న రహస్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కొండపై ఉన్న పాత హోటల్ పరిధి ఎంత ఉందో అంత మేరకే నిర్మాణం చేయాలని కోర్టులు కూడా స్పష్టం చేశాయని తెలిపారు. కొండ మొత్తాన్ని తొలిచిననట్లు ఉన్నారని అందుకే అక్కడకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదని మండిపడ్డారు జీవీఎల్. రుషికొండ తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.