ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం ఆలయాలు విగ్రహాలు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు అంతర్వేదిలో ఆ తర్వాత కొన్ని ఘటనలు ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం లో ఆలయాల్లో ఉన్న విగ్రహాలు ధ్వంసం కావడంతో అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా రామతీర్థం ఘటనకు సంబంధించి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ఉన్నాయి. టిడిపి నేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు భారీ స్థాయిలో సీఎం జగన్ పై డైలాగులు వేస్తున్నారు. తాను హిందువుని అని ప్రకటించుకుంటూ వైసిపి పార్టీని ఒక మతానికి సంబంధించింది అన్నట్టు కార్నర్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఏపీలో ఆలయాలలో విగ్రహాలు ధ్వంసం ఘటనపై జాతీయ మీడియాలో స్పందించారు. ఆలయాలలో విగ్రహాల ధ్వంసం ఘటనల వెనక చంద్రబాబు హస్తం ఉన్నట్టు గా అభివర్ణించారు.
జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు ఆడుతున్న డ్రామా అంటూ జాతీయ న్యూస్ ఛానల్ లో సుబ్రహ్మణ్య స్వామి తేల్చిచెప్పారు. ఇదే క్రమంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న కొన్ని నిర్ణయాలను ప్రశంసించారు. తిరుపతి లో తెల్లవారు ఝామున 2 గంటలకు పూజ చేసి కూడా బయట పబ్లిసిటీ చేసుకొని వ్యక్తిత్వం జగన్ ది, తిరుపతి దేవస్థానం లెక్కలు CAG చేత ఆడిట్ చేయించడానికి ఒప్పుకున్న మొట్టమొదటి సీఎం జగన్ అంటూ బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి జాతీయ మీడియా ఛానల్ లో తేల్చి చెప్పారు.
అదేవిధంగా టీటీడీలో క్రైస్తవులకు జగన్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇచ్చారు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. తాను విచారణ చేయడం జరిగిందని ప్రస్తుతం టీటీడీ పరిధిలో ఏడుగురు అన్యమతస్తులు విధులు నిర్వహిస్తున్నారని, వాళ్లంతా గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వాళ్లని కావాలంటే ఈ విషయంలో ఎక్కడికైనా చర్చకు నేను వస్తాను అంటూ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదంతా చంద్రబాబు కుట్ర. సోనియాగాంధీ(కాంగ్రెస్)తో కలసి పోటీచేస్తే ప్రజలు ఎవరూ ఆయన వైపు చూడలేదు. అందుకే ఆయన హిందుత్వను వేదికగా చేసుకుంటున్నారు… అంటూ బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తేల్చి చెప్పారు.