AP Inter Exams: ఆసని తుఫాను కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆసని తుఫాను నేపథ్యంలో బుధవారం నిర్వహించాల్సిన ఇంటర్ మొదటి సంవత్సవరం పరీక్షను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. వాయిదా పడిన ఈ పరీక్షను 25వ తేదీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో ఏపిలో ఇంటర్ పరీక్షలు అసని తఫాను కారణంగా వాయిదా పడినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Inter Exams: యథవిధిగా ఇంటర్ పరీక్షలు
ఈ వదంతులపై ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు స్పందిస్తూ పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు. గురువారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని శేషగిరిబాబు తెలిపారు. సోషల్ మీడియా వస్తున్న తప్పుడు ప్రచారం, వదంతులను నమ్మవద్దని ఆయన వెల్లడించారు. తొలుత ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం గురువారం నుండి సెకండ్ ఇంటర్ గణితం, వృక్ష, పౌరశాస్త్రం పరీక్షలు ఉంటాయని కార్యదర్శి శేషగిరిబాబు స్పష్టం చేశారు.