Nandyala: నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం జరిగింది. 12 మందితో వెళుతున్న పర్యాటక శాఖ బోటు బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతు అయ్యారు పది మందిని స్థానికులు రక్షించారు. గల్లంతైన సాజిదా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు రక్షించిన వారిలో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా ఇద్దరు పర్యాటకలు చస్మిన్, హనీలను మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు కోవేలకుంట్లకు చెందిన ఆశాబీ (28), నంద్యాలకు చెందిన నూర్జహాన్ (35) గా అధికారులు గుర్తించారు. పర్యాటకులు లైఫ్ జాకెట్ లు ధరించడం వల్ల పెనుప్రమాదం తప్పిందని అంటున్నారు. బోటులోకి ఒక్కసారిగా నీరు రావడంతో బోటు ముగినిట్లు తెలుస్తొంది.
ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో అవుకు జలాశయం నదీ విహారానికి వచ్చారు. ఈ క్రమంలోనే కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రసూల్ కుటుంబం విహార యాత్రకు వెళ్లింది. రసూల్ కుటుంబం బోటులో ప్రయాణిస్తుండగా దురుదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. రెండేళ్ల క్రితం అవుకు జలాశయంలో పర్యాటక శాఖ అధికారులు బోటు షికారు ప్రారంభించారు.
చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ .. చంద్రబాబు నివాసం అటాచ్