Botsa satyanarayana : రాజకీయాల్లో కొందరు నాయకులు ప్రత్యర్థులను పనిగట్టికుని విమర్శలు చేస్తూనే ఉంటారు. కాని కొందరు ప్రత్యర్థులైైనా వారి జోలికి సహజంగా వెళ్లరు, వారిపై పెద్దగా విమర్శలూ చేయరు. అయితే ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, వెలగపూడి రామకృష్ణ బాబును తరచు అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అశోక్ గజపతిరాజును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వర్గీయులను వైసీపీలోకి గానీ బీజెపీలోకి గాని వెళ్లే విధంగా ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
మాన్సాస్ ట్రస్ వ్యవహారంలో అశోక్ గజపతిరాజు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయం అందరికీ తెలుసు. సీఎం వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి మాన్సాస్ ట్రస్ నుండి తొలగించి ఆ పదవిని ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతిరాజుకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అశోక్ గజపతిరాజును గతంలో ప్రత్యర్థులు కూడా పెద్దగా విమర్శించే వారు కాదు. ఆయన కూడా హుందా రాజకీయాలు సాగించే వారు. మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా ఆయనపై గతంలో పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు, తాజాగా అశోక్ గజపతిరాజుపై బోత్స సత్యనారాయణ ఘాటుగానే విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బడి, గుడి చూడని ఆ పెద్దమనిషి అధికారం కోల్పోయిన తరువాత దేవుడు, దగా అని గుండెలు బాదుకోవడం విడ్డూరంగా ఉందంటూ బొత్సా విమర్శించారు. ఎన్ని సార్లు మంత్రి పదవులు చేశామని కాదు ప్రజలకు కావాల్సిన పనులు చేశామా లేదా అన్నది ముఖ్యమని అన్నారు బొత్సా సత్యనారాయణ.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే శ్రీరామ తీర్థ సాగర్ నుండి నీరు తీసుకురావాలని ప్రయత్నించామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కక్షతో ఆ ప్రాజెక్టుని నిలిపివేసిందన్నారు. రామతీర్థం సాగర్ సాగర్ ద్వారా నీరు తీసుకువస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి పథకం ద్వారా పండుగ కు ముందే పిల్లల తల్లుల ఖాతాలో జమ చేశామని అన్నారు. ఇటువంటి మంచి ఆలోచన చంద్రబాబుకు ఎవ్పుడూ రావని విమర్శించారు.