Brahmamgari Matam: కలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపత్యం వివాదంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏకాభిప్రాయంతో వివాదం ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ ఏపి హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం సశేషం అయ్యింది.పీఠాధిపత్యం విషయంలో తనపై ఒత్తిడి తీసుకువచ్చి అంగీకరించేలా చేశారని మారుతీ మహాలక్ష్మమ్మ ఆరోపించారు. రాజీ చర్చల్లో తనను బలవంతంగా ఒప్పించారని ఆమె హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
పీఠాధిపతి నియామకం అనేది వీలునామా ప్రకారమా లేదా కుటుంబ సభ్యుల ఒప్పందం ప్రకారమా అనేది తేల్చాలని ఆమె హైకోర్టుకు విన్నవించారు. వీలునామా ప్రకారం తన కుమారుడికే పీఠాధిపత్యం దక్కాలని కోరుకుంటున్నాననీ, వివాదానికి పరిష్కారం చూపాలని పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తనకు న్యాయం జరగాలనే కొరుకుంటున్నాననీ, ఈ విషయంలో భక్తులు, గ్రామస్తులు అర్థం చేసుకోవాలని కోరారు.
నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో రాజీ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. మఠం పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్రస్వామిలను ఎంపిక చేస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. మారుతీ మహాలక్ష్మమ్మ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?