Breaking: జంగారెడ్డిగూడెం ఘటనపై అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న క్రమంలో 11 మంది టీడీపీ సభ్యులను ఒక్క రోజు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులు ఆదిరెడ్డి భవాని, బీ అశోక్, నిమ్మకాయల చిన రాజప్ప, నాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మెహన్, రామకృష్ణబాబు వెలగపూడి, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ లను సస్పెన్షన్ కు డిప్యూటి సీఎం నారాయణ స్వామి ప్రతిపాదించగా స్పీకర్ మూజువాణి ఓటు ఆమోదించారు. సస్పెన్షన్ కు గురైన టీడీపీ సభ్యులు సభను విడిచి వెళ్లాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆశించారు.
మొన్న అచ్చెన్నాయుడుతో సహా అయిదుగురిని బడ్జెట్ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేసిన అసెంబ్లీ, నిన్న, ఈ రోజు టీడీపి సభ్యులను ఒక్క రోజు పాటు సస్పెన్షన్ వేటు వేసింది. వరుసగా మూడవ రోజు టీడీపీ సభ్యులు జంగారెడ్డిగూడెం ఘటనపై చర్చ జరపాలనీ పట్టుబట్టారు. సీఎం సభలో అసత్యాలు చెట్టారంటూ నినాదాలు చేశారు. అనారోగ్యం, ఇతర కారణాలు, సహజ మరణాలను కల్తీ సారా మరణాలు అంటూ టీడీపీ రాజకీయం చేస్తోందని అధికార పక్షం టీడీపీ విమర్శలను తిప్పికొట్టింది.