Breaking: ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త జిల్లా ఏర్పాటు అవ్వనున్నది. ఇప్పటికే ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.అయితే 26 జిల్లలకు తోడు మరో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నదట. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Breaking: గిరిజన ప్రాంతాలకు ఓ ప్రత్యేక జిల్లా
గిరిజన ప్రాంతాలకు ఓ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుండి స్పెషల్ నిధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చూచాయగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రంలో మరో కొత్త జిల్లా వచ్చే అవకాశం ఉందంటూ మంత్రి పేర్ని నాని సంకేతాలు ఇచ్చారు.గిరిజన ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. రంపచోడవరం జిల్లా సాధన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది.