Breaking: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్మణాలు తీసుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా కీలక అధికారుల బదిలీలు జరగడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతోంది. సీఎంఓలో అన్ని తానే అయి చక్రం తిప్పిన ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బదిలీ జరిగి 24 గంటలు కాకమునుపే ఏపి పోలీస్ బాస్ పైనా బదిలీ వేటు పడింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ మొదటి నుండి జగన్ కు అనుకూలంగానే ఉన్నారు. ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయడంపై ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీజీపీ సవాంగ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని సవాంగ్ కు ప్రభుత్వం ఆదేశించింది.
Breaking: రెండేళ్లుగా సమర్ధవంతంగా బాధ్యతలు
డీజీపీగా గౌతమ్ సవాంగ్ గత రెండు సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అనేక అంశాల్లో ఏపి పోలీసులు అవార్డులు కూడా అందుకున్నారు. గౌతం సవాంగ్ బదిలీకి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే ఈ నెల 3వ తేదీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అవ్వడంపై సీఎం జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పినప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులను పోలీసులు అనుమతించడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ సవాంగ్ జగన్ ను కలిసి వివరణ కూడా ఇచ్చారు.
Read More: YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం..సీఎంఒలో కీలక అధికారి బదిలీ..! ఎందుకంటే..?