Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ఇంతకు ముందే సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని డిపార్ట్ మెంట్ టెస్ట్ పాస్ అయిన వారందరి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Breaking: ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు
ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంతకం చేయగా, ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరిగినట్లు అయ్యింది. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల సర్వీస్ (ప్రొబేషన్ పిరిడ్) గత ఏడాది అక్టోబర్, డిసెంబర్ నాటికి పూర్తి అయినప్పటికీ రాష్ట్ర అర్ధిక పరిస్థితి మూలంగా ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లరేషన్ ను వాయిదా వేసింది. జూన్ నెలలో చేస్తామని ఉద్యోగ సంఘాల ఆందోళన సమయంలో సీఎం జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారు.
కాగా, ఆర్ధిక శాఖ అధికారులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యగులకు పాత పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాన్ని పక్కన బెట్టి కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేత కాకర్ల వెంకట్రామిరెడ్డి సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు.