Breaking: టెన్త్ పేపరు లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఊరట లభించింది. గత సోమవారం నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుండి 2014లోనే నారాయణ తప్పుకున్నారంటూ ఆయన తరపు న్యాయవాదులు మెజిస్ట్రేట్ కు విన్నవించిన నేపథ్యంలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం నారాయణకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఇటీవల చిత్తూరు సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. నారాయణ కు నోటీసు జారీ చేస్తూ విచారణను వాయిదా వేయింది.
- Read the latest news from
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Breaking: 18వ తేదీ వరకూ ముందస్తు బెయిల్
ఈ వ్యవహారం ఇలా ఉండగా నారాయణ విద్యాసంస్థలు యాజమాన్యంగా ఉన్న నారాయణ కుమార్తెలు శరణి, సింధూర, అల్లుడు పునీత్ లతో పాటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న మరో పది మంది ముందస్తు బెయిల్ మంజూరునకు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్ ను అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ నెల 18వ తేదీ వరకూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వారి విషయంలో ఎలాంటి తొందర పాటు చర్యలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్ పై పూర్తి స్థాయి విచారణకు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.