Breaking: ఏపి సర్కార్ 8 మంది సీనియర్ ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేఎస్ జవహర్ రెడ్డిని సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ టీటీడీ ఈఓగానూ జవహర్ రెడ్డి కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొంది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న ఎంటి కృష్ణబాబుకు రవాణా శాఖ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, సీసీఎల్ఎ గా జి సాయి ప్రసాద్ బదిలీ అయ్యారు. సాయిప్రసాద్ కు రెవెన్యూ భూరికార్డుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జిఎస్ఆర్కే విజయకుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ లను బదిలీ చేసిన ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ హెచ్ర్ సర్వీసుల విభాగం అదనపు బాధ్యతలను కూడా శశిభూషణ్ కుమార్ కు అప్పగించింది. ఎక్సేజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజిత్ భార్గవ బదిలీ అయ్యారు. రజిత్ భార్గవ్ కే యువజన సర్వీసులు, క్రీడల శాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది. ఏపి డెయిరీ డెవలప్ మెంట్ ఎండీ ఏ బాబుకు ఏపిపిఎస్సీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును రిలీవ్ చేస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ బా బాధ్యతలు అప్పగించింది. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి ఏసీబీ డీజీ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్వోపీఎఫ్ అదనపు బాధ్యతల్లోనూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.