Breaking: గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జిల్లాలోని మాచర్ల మండలం రాయవరం గ్రామంలో పొలం వివాదంతో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మాజీ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావు కాల్పులు నాలుగు రౌండ్ లు కాల్పులు జరిపారు.
ఘర్షణలో మట్టా శివ, బాలకృష్ణ అనే వ్యక్తులు మృతి చెందగా ఆంజనేయులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
YS Vijayamma: విజయమ్మ ఏం చేయబోతున్నారు..? ఆ మంత్రులకు ఆహ్వానం..!!
Big Breaking: కేసీఆర్ కి టీడీపీ ఎమ్మెల్యేల లేఖ.. జగన్ పై ఘాటు విమర్శలు..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?