Breaking: ఈత సరదా తీర్చుకోవడం వెళ్లిన నలుగురు యువకులు గల్లంతైన ఘటన కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద జరిగింది. కడప బెల్లం బండి వీధి ప్రాంతానికి చెందిన కొందరు యువకులు పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ఈతకు దిగి గల్లంతైయ్యారు. విషయం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.