Breaking: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా తీర్చుకోవడం కోసం వెళ్లిన నలుగురు యువకులు క్వారీ గుంతలో గల్లంతు అయ్యారు. ప్రత్తిపాడుకు చెందిన సాయి ప్రకాశ్, వెంకటేశ్, వంశీ, శంకర్ లు గల్లంతు అయినట్లు సమాచారం.
ఆరుగురు యువకులు డైట్ కాలేజీ సమీపంలోని క్వారీ వద్దకు పార్టీ చేసుకోవడానికి వెళ్లారు. వీరిలో నలుగురు యువకులు ఈత కొట్టేందుకు నీటిలో దిగి మునిగిపోయారు. ఒడ్డున ఉన్న యువకులు వెంటనే అప్రమత్తం అయి పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతు అయిన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ప్రత్తిపాడు గ్రామంలో విషాద శ్చాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?