Breaking : ఏపి ప్రభుత్వం ప్రతిపాదించిన 2021-22 ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ఆమోదించుకునే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం మూడు నెలల ప్రభుత్వ ఖర్చుల నిమిత్తం బడ్జెట్ అర్డినెన్స్ కు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి జూన్ నెలాఖరు వరకూ సుమారు 86 వేల కోట్ల మేర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం లభించింది. జూన్ నెలాఖరులోపు తిరిగి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆమోదించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది కరోనా నేపథ్యంలోనూ ప్రభుత్వం బడ్జెట్ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి వచ్చింది.